రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సీనియర్ క్రికెటర్ జహీర్ఖాన్ బౌలింగ్లో పదును ఏమాత్రం తగ్గలేదు. 38 ఏళ్ల వయసులో కూడా సత్తా చాటుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో వంద వికెట్లు పడగొట్టి మరోసారి మెరిశాడు. ఫిరోషా కోట్లా మైదానంలో రైజింగ్ పుణే సూపర్జెయింట్స్, ఢిల్లీ డేర్డెవిల్స్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్లో అతడు ఈ ఘనత సాధించాడు. అజింక్య రహానేను క్లీన్బౌల్డ్ చేసి ఐపీఎల్ వందో వికెట్ మైలురాయిని చేరుకున్నాడు.ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన పదో బౌలర్గా, 8వ భారత బౌలర్గా నిలిచాడు.