ఆంధ్రప్రదేశ్ విపక్ష రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి లోకేష్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ పాతగాజువాకలో వైసీపీ దీక్షాశిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం విక్రయిస్తే వచ్చే డబ్బుతో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. చైనాకు అటవీ కార్యదర్శిని పంపి రూ.10 వేల కోట్ల చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ధ్వజమెత్తారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా గుర్తుకురాని ప్రత్యేక హోదా...
ఇప్పటికిప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు, లోకేశ్ అవినీతిపైనా, వారికి సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు చేపడతామన్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని...వారి విషయంలో జగన్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా విజయసాయి రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యడం కొత్త కాదు. గతంలో కూడా ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ లో అధికారులను బెదిరించిన సంగతి తెలిసిందే.