అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉత్తర కొరియా ధిక్కార చర్యలను ఏమాత్రం సహించజాలని అగ్రరాజ్యం అమెరికా ఉత్తర కొరియాపై దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సంకేతాలను నిజం చేసేలా మిత్రదేశం దక్షిణ కొరియా సముద్ర ప్రాదేశిక సముద్ర జలాల్లోకి యుద్ధ నౌకను అమెరికా తరలిస్తోంది.ఈ పరిణామాలు చూస్తుంటే,వీరి ఇరువురు మధ్య యుద్ధం అనివార్యమని అనిపిస్తున్నట్టు నిపుణులు వ్యాఖ్యానించారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కింమ్ జాంగ్ ఉన్కు షాకిచ్చేలా యూఎస్ వార్షిప్లలో అత్యంత కీలకమైన యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ను కూడా ఉత్తర కొరియా సముద్ర జలాల్లోకి అమెరికా పంపిస్తోంది. ఇప్పటికే యూఎస్ఎస్ కార్ల్ విల్సన్ దక్షిణ కొరియాకు దగ్గరగా ఉండగా, ఇప్పుడు దానికి తోడుగా మరో యుద్ధ నౌక వచ్చి చేరింది. ఈ రెండూ కలసి యుద్ధ విన్యాసాలు చేయనున్నాయని యూఎస్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.