ఏపీపై కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఏపీలో వామపక్షాలు ఈరోజు బంద్ తలపెట్టాయి. విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక లెనిన్ సెంటర్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్త కొణిజేటి ఆదినారాయణ పాల్గొన్నారు.
ఈ బంద్ కు తన మద్దతు తెలిపారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ తలపెట్టిన ఈ పోరాటానికి తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు తెలపాలని కోరతానని అన్నారు.
కాగా, ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.