ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్.. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటల వరకు 20 గంటలపాటు కొనసాగనుంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ఎం1 వాహక నౌక దీన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. 3.8 టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాన్ని వాహకనౌక రోదసీలోకి తీసుకెళ్తుంది. జులై 15న తెల్లవారుజామున నిర్వహించాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.