మహమ్మద్ షమీ ఈ పేరు తెలియని భారత్ క్రికెట్ అభిమాని ఉండరు. గత కొన్ని నెలలుగా భారత్ టీం లో కీలక ప్లేయర్ గా ఎదిగాడు. ఇప్పుడు అతని జీవితం ఇరకాటం లో పడింది. షమీ ఫై అయన భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోల్కతా పోలీసులు షమీపై గృహ హింసా చట్టం, భార్య జహాన్ను వేధించటం, రేప్ అటెంప్ట్, హత్యాయత్నం, వివాహేతర సంబంధాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పలువురి యువతులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని భార్య హాసిన్ జహాన్ చేసిన ఆరోపణలతో వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో బీసీసీఐ షమీకి చోటు కల్పించని విషయం తెలిసిందే. అయన ఫై క్లీన్ చీట్ వస్తే అప్పడు వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో పేరు చేరుస్తామని చెబుతున్నారు.
తాజాగా వివాదంలో చిక్కుకున్న షమీని ఐపీఎల్ మ్యాచ్ లకు అనుమతించాలా వద్దా అనే ఆలోచనలో ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం ఉంది. ఈ విషయంలో బీసీసీఐ న్యాయసలహా తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. మహ్మద్ షమీని ఈసారి వేలంలో ఢిల్లీ రూ. 3 కోట్లకు దక్కించుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈ వివాదంతో షమీ ఐపీఎల్కు దూరమైతే షమీ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారనుంది.