భారత రాష్ట్రపతి 'ప్రణబ్ ముఖర్జీ' వస్తుసేవల పన్ను (GST) కు సంబంధించిన నాలుగు శాసనాలను గురువారం ఆమోదించారు. దీంతో జులై 1 నుంచి కొత్త విధానమైన
"ఒకే దేశం - ఒకే పన్ను" అమల్లోకి తేవటానికి మార్గం సుగమమైంది. ఆమోదం పొందిన ఆ నాలుగు శాసనాలు ఏవంటే
1) GST చట్టం 2017
2) సమీకృత GST చట్టం
3) GST రాష్ట్రాలకు పరిహర చట్టం 2017
4) కేంద్రపాలిత ప్రాంతాల GST చట్టాలు.