పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాద దేశంగా విరాజిల్లుతుంది. ప్రపంచ దేశాల సమక్షం లో దృష్టిలో పాకిస్తాన్ ప్రతిష్ట, పరువు మంటగలిసింది పోయింది . ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించిన ఉగ్రవాదుల జాబితాలో ఏకంగా 139 మంది పాక్ టెర్రరిస్టులకు చోటు దక్కింది.
ప్రస్తుతం పాకిస్తాన్లో నివసిస్తూ ఆ దేశం నుంచి ఉగ్ర కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఉగ్రవాదులను తాజా ఈ జాబితాలో చేర్చింది. అల్ఖైదా ప్రస్తుత నేత అల్ జవహరి ఈ జాబితాలో ముందువరుసలో నిలవగా, తమకు అప్పగించాలని భారత్ కోరుతున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరేకు చెందిన హఫీజ్ సయీద్, ఆయన అనుచరులు అబ్దుల్ సలాం, జఫర్ ఇక్బాల్లు కూడా ఈ లిస్ట్ లో వున్నారు.
ఉగ్రకార్యకలాపాలకు ఊతమిస్తున్న పాక్కు చెందిన అల్ రషీద్ ట్రస్ట్, హర్కతుల్ ముజహదీన్, ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, జేఈఎం, రబితా ట్రస్ట్, అల్ అక్తర్ ట్రస్ట్ ఇంటర్నేషనల్, హర్కతుల్ జిహాద్ ఇస్లామి, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, జమతుల్ అహ్రర్ వంటి సంస్థలు యూఎన్ ఉగ్ర జాబితాలో ఉన్నాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే, పాకిస్తాన్ మాత్రం తమది ఉగ్రవాదం చేత భాదింపబడుతున్న దేశం అని చెబుతున్నారు.