తెలుగు తేజం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంపాదన పరంగా చరిత్ర సృష్టించారు. మంగళవారం (ఆగస్టు6, 2019) ఫోర్బ్స్ 2019 విడుదల చేసిన టాప్-15లో చోటు దక్కించుకున్న ఏకైక భారత మహిళా అథ్లెట్గా ఘనత సాధించారు. సింధు ఫోర్బ్స్ లెక్కల ప్రకారం రూ.39 కోట్లు( 5.5 మిలియన్ డాలర్ల) ఆదాయంతో 13వ స్థానాంలో నిలిచారు. ఆమెకు ఈ ఆదాయం అంతా ప్రకటనలు, వేతనం, ప్రోత్సాహకాల ద్వారా లభించింది.
భారత మహిళా అథ్లెట్స్లో సింధు ప్రభావవంతమైన క్రీడాకారిణి అని, వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ 2018లో సింధు విజేతగా నిలవడంతో ఆమెకు అభిమానుల్లో మరింత క్రేజ్ పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. అలాగే గతేడాది ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో సింధు ఏడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది మహిళా అథ్లెట్లలో అత్యంత సంపన్నరాలిగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్సన్ నిలిచారు. సెరెనా సంపద 29.2 మిలియన్ డాలర్లు.
సింధు గతేడాది వరల్డ్ టూర్ ఫైనల్స్లో విజేతగా నిలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్గా గుర్తింపు సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సింధు అంచనాలకు మించి ఆడటం లేదు. ఇండోనేసియా టోర్నీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడంతో సహా, సింగపూర్, మలేసియా, జపాన్, జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణమే లక్క్ష్యంగా సింధు బరిలోకి దిగుతోంది.