ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ అమెరికా ని హెచ్చరించిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రపంచమంతా న్యూయిర్ వేడుకల్లో మునిగి ఉంటే నా టేబుల్పై అణు బాంబు బటన్ ఉంది. నా వేలు దానిపైనే ఉంది. ఎప్పుడైనా దాన్ని ప్రెస్ చేసేస్తాను అంటూ అమెరికాను టార్గెట్ చేస్తున్నాడు. అయితే అగ్ర రాజ్య అధినేత ట్రంప్ కూడా కిమ్కి ధీటుగానే సమాధానం చెబుతున్నాడు.
నాదగ్గర కూడా అంతకంటే శక్తి వంతమైన అణు బాంబు ఉంది అని అంటున్నాడు ట్రంప్. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అణు ప్రయోగాల విషయమై అనేక సార్లు బహిరంగంగానే హెచ్చరికలు చేసుకున్నారు. ఇటీవల అమెరికా మిలిటరీ మాజీ చీఫ్ ఉత్తరకొరియాకు యుద్ధానికి సిద్దంగా ఉన్నామంటూ మెసేజ్ కూడా పంపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ఉత్తర కొరియాపై రగిలిపోతోంది.
యుద్ధ సంకేతాలు పంపుతోందని యూఎస్ జాయింట్ చీఫ్ మాజీ ఛైర్మన్ మైక్ ముల్లెన్ అన్నారు. ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించారు ట్రంప్. ఉత్తర కొరియాని మట్టుపెట్టడం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ హెచ్చరికలకు కిమ్ ఏమీ కామ్గా లేడు. గత ఏడాది నవంబర్లో ఆ దేశం అత్యంత శక్తివంతమైన క్షిపణిని అమెరికాపై ప్రయోగించింది. దీంతో ఆగేది లేదు. ముందు ముందు మా తడాఖా ఇంకా చూపిస్తామంటోంది.