పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్కు కోర్టులో చుక్కెదురైంది. ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి బేనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడైన ముషర్రఫ్ దేశం నుంచి పరారీ అయినట్లు కోర్టు ప్రకటించింది. ఆయనను ప్రకటిత నేరస్థుడిగా కోర్ట్ పేర్కొంది. బేనజీర్ హత్యకు జరిగిన కుట్ర వివరాలు ముషర్రఫ్కు తెలుసునని, ఆమె హత్యలో ఆయన పాత్ర ఉందని కోర్టు నిర్ధారించింది.
ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులకు 17 ఏళ్ల జైలు శిక్షను విధించారు.బేనజీర్ హత్యకేసులో మరో ఐదుగురు నిందితులు నిర్దోషులని పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు నిర్థారించింది. 2007 డిసెంబరు 27న రావల్పిండిలో బేనజీర్ భుట్టో హత్య జరిగింది.
ఎన్నికల సభలో పాల్గొన్న అనంతరం బయటికి వస్తూండగా ఆమెపై తుపాకులు, బాంబులతో దాడి చేసి హత్య చేశారు. న్యాయమూర్తి అస్ఘర్ అలీ ఖాన్ అడియాలా జైలులో సోమవారం నుంచి రోజువారీ విచారణ నిర్వహించారు.