క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో జట్టు శుక్రవారం భారత్లో అడుగుపెట్టింది. మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్ చేరుకుంది. ఈ నెల 22 నుంచి నవంబర్ 7 వరకు న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. అంతకుముందు ఇండియా బోర్డు ప్రెసిండెంట్స్ ఎలెవన్తో న్యూజిలాండ్ రెండు సన్నాహక (అక్టోబరు 17, 19న) మ్యాచ్లను ఆడనుంది.
అక్టోబరు 22న ముంబయిలోని వాంఖడే మైదానంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది.