ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్న భారత సారథి.. వేగంగా సెంచరీ పూర్తి చేశాడు. వరసగా రెండోసారి టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కు పిలిచిన లంక జట్టు కెప్టెన్ తిసారా పెరీరాకు చుక్కలు చూపిస్తున్నాడు.
తనదైన శైలిలో విరుచుకుపడిన రోహిత్.. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 23 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేసిన రోహిత్ శర్మ.. మరో 12 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కేవలం 35 బంతుల్లో మెరుపు వేగంతో 11 పోర్లు, 8 సిక్సర్ల సాయంతో రోహిత్ శర్మ 101 పరుగులు చేయడంతో స్టేడియం అంతా రోహిత్.. రోహిత్ నినాదాలతో మార్మోగిపోయింది. ఇంతవరకు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 12 ఓవర్లకి 149గా ఉంది. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ 46 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
టీ20 ల్లో రోహిత్ శర్మకి ఇది 13వ అర్ధ సెంచరీ. ప్రస్తుతం క్రీజులో రోహిత శర్మ 74, లోకేశ్ రాహుల్ 44 పరుగులతో ఉన్నారు. 20 ఓవర్లు ముగిసే నాటికి టీమిండియా అతి భారీ స్కోరు నమోదు చేసే అవకాశం ఉంది.