స్వీడిష్ కి చెందిన ఐకియా ఫర్నీచర్ దిగ్గజం తన నూతన స్టోర్ను తాజాగా నేడు హైదరాబాద్ హైటెక్స్లో లాంచ్ చేసింది. కాసేపటి క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ స్టోర్ను ప్రారంభించారు. ఇండియాలో ఐకియా ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్టోర్ కూడా ఇదే కావడం విశేషం. 4 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో దాదాపుగా 7500 స్వీడిష్ బ్రాండ్లు ఉన్నాయి.
అలాగే, దాదాపు 1000 రకాల వస్తువులు కేవలం రూ.200లకే కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్లో దాదాపు 950మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉపాధి పొందగా, మరో 1500మంది పరోక్షంగా ఉపాధి పొందనున్నారు.
కాగా, 2025నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో దాదాపు 25 ఐకియా స్టోర్లని అందుబాటులోకి తీసుకురావాలని ఐకియా సంస్థ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు ఐకియా గ్రూప్ సీఈవో జెస్పర్ బ్రోడిన్, ఐకియా ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ తదితరులు పాల్గొన్నారు.