స్టార్డం ఉన్న నందమూరి తారక్ అబిడ్స్ లో ఉండేవాడంటున్నారు..తన చిన్నప్పుడు అబిడ్స్ జగదీశ్ మార్కెట్కు వెళ్లి మొబైల్ ఫోన్స్ కొనేవాడినని, అక్కడ చాలా సార్లు ఇన్ఫ్లుయెన్స్ సేల్కు గురయ్యేవాడినని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు.
సెల్కాన్ మొబైల్స్ అధినేతలు వై.గురు, మురళి రిటైల్ మొబైల్ స్టోర్స్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. ‘సెలెక్ట్ ' అనే బ్రాండ్తో రిటైల్ మొబైల్ స్టోర్లను తెరుస్తున్నారు. ఈ బ్రాండ్కు అంబాసిడర్గా ఎన్టీఆర్ను నియమించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటుచేసి బ్రాండ్ అంబాసిడర్ను అధికారికంగా ప్రకటించారు. మొబైల్ రిటైల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పును తీసుకొస్తున్నట్లు సెలెక్ట్ మొబైల్స్ డైరెక్టర్ మురళి వెల్లడించారు.
‘ఒక మొబైల్ ఫోన్ కొనడానికి ఏదైనా షాప్కు వెళ్లినప్పుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్ల ఒత్తిడితో, లేదంటే వేరే కారణాలతో కస్టమర్కు కావాల్సింది కాకుండా షాప్ వాళ్లు చెప్పిందే కొనుగోలు చేస్తారు. దీన్నే ఇన్ఫ్లుయెన్స్ సేల్ అంటారు. దీన్ని మార్చాలనే ఉద్దేశంతో సెలెక్ట్ స్టోర్లలో ‘వర్చువల్ సేల్స్ అసిస్టెంట్’ను ఏర్పాటు చేస్తున్నాం. అంటే కస్టమర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్లకు కావాల్సిన ఫోన్లను టచ్ కియోస్క్ ద్వారా కంపేర్ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. ఉదాహరణకు చాలా మందికి కెమెరాపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్కో ఫోన్తో ఫొటోలు తీసుకుని స్వైప్ చేస్తే ఆ ఫోలన్నీ మిషన్లోకి వెళ్లిపోతాయి.
వాటిని పెద్దవిగా చేసి చూసుకుని, పిక్సెల్స్ ఎలా ఉన్నాయో పరీక్షించుకుని మీకు నచ్చిన ఫోన్ను కొనుగోలు చేసుకోవచ్చు’ అని మురళి వివరించారుఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘కొన్ని రోజుల క్రితం గురు, మురళి నన్ను కలిసి ‘సెలెక్ట్’కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని కోరారు. వాళ్ల విజన్ను నాకు వివరించారు.
గురు, మురళి శక్తి సామర్థ్యాల గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరంలేదు. వాళ్ల సామర్థ్యా్న్ని మీరు కొన్నేళ్లుగా చూస్తున్నారు. అయితే నేను ఈ బ్రాండ్కు అంబాసిడర్గా అంగీకరించడానికి కారణం వాళ్ల విజన్, ఇన్నోవేటివ్ ఐడియా. సెలెక్ట్ స్టోర్స్ ఎలా ఉండబోతున్నాయో నాకు పూర్తిగా వివరించినప్పుడు.. ఆపిల్ స్టోర్స్ గుర్తొచ్చాయి. బహుశా వాటికంటే కూడా సెలెక్ట్ స్టోర్లను చాలా వైబ్రెంట్గా డిజైన్ చేశారు’ అని వెల్లడించారు. మొబైల్ బ్రాండ్ అంబాసిడర్గా బన్నీ,చెర్రీ మంచి పేరు పైసల్ సంపాదించారు...అదే కోణంలో ఎన్టీఆర్ రాణిస్తాడని అంటున్నారు...