వికలాంగుడు చనిపోయిన రెండేళ్లకు వికలాంగధ్రువీకరణ పత్రం ఇస్తాం రావాలని పిలిచిన ఘటన అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే...విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రానికి చెందిన చిప్పాడ బసవేశ్వరరావుకు 20 ఏళ్ల కిందట జరిగిన ప్రమాదంలో రెండుకాళ్లు దెబ్బతిన్నాయి.
దీంతో వికలాంగ ధ్రువీకరణపత్రంతో కొన్నేళ్లు పింఛను పొందాడు. అయితే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న ధ్రువీకరణ పత్రం కోసం 2015 లో డీ-ఆ-ర్డీ-ఏ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అదే ఏడాది ఆగస్టులో బసవేశ్వరరావు మృతిచెందాడు. అయితే ఆయన ధరఖాస్తుచేసిన రెండేళ్ల తరువాత అంటే తాజాగా అతనికి ధ్రువీకరణ పత్రం ఇస్తాం రావాలంటూ అతని ఇంటికి డీఆర్డీఏ కార్యాలయం నుంచి పిలుపువచ్చింది.
దీంతో గ్రామస్థులు షాక్ తిన్నారు. ఇది స్థానికంగా కలకలం రేపడంతో..చనిపోయిన రెండేళ్లకు ఎలా పిలుస్తున్నారు? అధికారుల్లో ఇంత నిర్లక్ష్యమా? అని ఆశ్చర్యపోతూ మండిపడుతున్నారు.