టెలికాం సబ్స్క్రైబర్లను టార్గెట్గా చేస్తూ... ఎస్ఎంఎస్ల వెల్లువ కొనసాగుతోంది.
ఈ మెసేజస్లోని సందేశం.. జనవరి 7 నుంచి మీ నెంబర్పై వాయిస్ సర్వీసులు ఆగిపోనున్నాయని. ఇతర నెట్వర్క్లోకి మీ నెంబర్ను మార్చుకుంటేనే పనిచేస్తాయంటూ ఆందోళనకర మెసేజ్లు వస్తున్నాయి. అన్ని టెలికాం ఆపరేటర్లకు ఈ మెసేజ్లు వెళ్తున్నాయి. దీంతో వెంటనే కస్టమర్లు ట్విట్టర్ వేదికగా టెలికాం కంపెనీలకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు.
అయితే ఈ మెసేజ్లను టెలికాం కంపెనీలు పంపడం లేదట. యూజర్ల ఫిర్యాదులపై స్పందించిన జియో, వొడాఫోన్, ఐడియా కంపెనీలు, అది తప్పుడు మెసేజ్లను అని, యూజర్లు ఆ మెసేజ్ను పట్టించుకోవద్దంటూ క్లారిటీ ఇచ్చాయి. వాటిని తాము పంపడం లేదని కూడా పేర్కొన్నాయి. ఎయిర్టెల్ ప్రతినిధి ఆ మెసేజ్ను ఓ స్పామ్గా ధృవీకరించారు. టాటా డొకోమో, బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లకు కూడా ఈ మెసేజ్లు వస్తున్నట్టు తెలిసింది.
ఆశ్చర్యకరంగా యూపీసీను జనరేట్ చేసి నెంబర్ను వేరే నెట్వర్క్కు పోర్టు పెట్టుకోవాలంటూ యూజర్లను ఆదేశిస్తున్నాయి. అయితే ఏ ఆపరేటర్కు పోర్టు పెట్టుకోవాలో చెప్పడం లేదు. ఒక్క ఆపరేటర్ సబ్స్క్రైబర్కు మాత్రమే కాక, ప్రతి ఆపరేటర్ యూజర్లకు ఈ మేరకు ఎస్ఎంఎస్లు వస్తుండటం సబ్స్క్రైబర్లను ఆందోళనలో పడేసింది.