ప్రఖ్యాత గజల్ గాయకులు, స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ ఆఫ్ఘానిస్తాన్ లో ఆగష్టు 1 నుండి 6 వరకు శాంతి యాత్ర చేయనున్నారు. ఈ శాంతి యాత్రలో భాగంగా ఆయన ‘దరి’ భాష లో రూపొందించిన “సలాం-బోగో” ఆడియో/వీడియో గీతాల ఆల్బం సి.డి ని ఆఫ్ఘానిస్తాన్ కాబూల్ లో ఆగష్టు 3 వ తేదిన ఆవిష్కరించనున్పారు.
శాంతియాత్రలో భాగంగా ఆగష్టు 1 నుండి 6 వరకు కాబూల్, మజార్-ఐ-షరీఫ్ తదితర ప్రాంతాలలో శాంతి గీతాల ప్రదర్సనలు ఇస్తారు. ఆఫ్గానిస్తాన్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రత్యేకంగా నిర్వహించనున్న ఒక కార్యక్రమంలో పాల్గొంటారని గజల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి సురేఖ తెలిపారు.