మాజీ మంత్రి, వ్యాపారవేత్త ప్రఫుల్ పటేల్ కూతురు పూర్ణ సంగీత్ వేడుకలో ధోనీ భార్య సాక్షి స్టెప్పులతో అదరగొట్టింది. ఈ సంగీత్ వేడుకకు భారీగా క్రికెటర్లు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలో భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి ధోనీ పాల్గొన్నాడు. ప్రస్తుతం సాక్షి డ్యాన్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రఫుల్ పటేల్ కూతురు పూర్ణ ధోనీ భార్యకు బెస్ట్ ఫ్రెండ్ అని సమాచారం. అందుకే సంగీత్ వేడుకలో ఎక్కడ చూసినా ఆమే కనిపించింది. ధోనీ కూతురు జీవా డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.