టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్, ఒక్కప్పటి ఇండియా కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని మరో ఆతున్యత మైన పురస్కారాన్ని అందుకున్నారు. ధోని పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్న విషయం తెలిసిందే. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ధోని ఆర్మీ దుస్తుల్లో వచ్చి కవాతు చేస్తూ మరి అవార్డు స్వీకరించాడు.
2007లో టి20 ప్రపంచకప్, అనంతరం వన్డే ప్రపంచకప్ అందించిన ధోనిని భారత ఆర్మీ 2011, నవంబర్ 1న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో సత్కరించింది. అయితే కెప్టెన్గా ధోని సరిగ్గా ప్రపంచకప్ అందించిన రోజే ఈ అత్యున్నత పురస్కారం అందుకోవడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశ సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపాడు. తన ఇన్స్టాగ్రమ్ పోస్ట్లో భారత మూడో అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆర్మీ దుస్తుల్లో అందుకోవడంతో నా సంతోషం పదిరెట్లు అయింది. మీ కుటుంబాలకు దూరంగా ఉంటూ, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, దేశ పౌరులు రాజ్యాంగ హక్కులను స్వేచ్చగా వినియోగించుకునేలా దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనికులందరికీ ధన్యవాదాలు. జైహింద్ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.