దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బయల్దేరుతున్నారు. రేపట్నుంచి 25వ తేదీ వరకు ఆయన దావోస్ లో గడుపనున్నారు.
ఈ సందర్భంగా ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉండబోతోంది. షెడ్యూల్ వివరాలు ఇవే...
22వ తేదీ
సదస్సు ప్రారంభోత్సవ సమావేశంలో ప్రసంగం
ఆ తర్వాత క్రిస్టల్ అవార్డుల వేడుకలో పాల్గొంటారు
డీఐపీపీ ఏర్పాటు చేసే ఇండియా రిసెప్షన్ కు హాజరు
23వ తేదీ:
ఏపీ లాంజ్ లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు
మధ్యాహ్నం నుంచి స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు
ఇదే రోజు ప్రధాని మోదీ ఏపీ లాంజ్ ను సందర్శిస్తారు
ఇండియా లాంజ్ లో ఏపీ-జపాన్ భోజన సమావేశంలో సీఎం పాల్గొంటారు
24వ తేదీ:
మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ బెల్విడర్ లో లంచ్ ఆన్ సమావేశం
టెక్నాలజీస్ ఫర్ టుమారో అనే అంశంపై టెక్నాలజీలో వినూత్న ఆవిష్కర్తలతో చర్చాగోష్టి
ఆ తర్వాత సీఐఐ సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం
బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ ఛైర్మన్ షేక్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఏర్పాటు చేసిన డిన్నర్ సమావేశానికి హాజరు
25వ తేదీ:
వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు
ఫ్రాన్ హోఫర్-ఏపీఈడీబీ మధ్య ఎంఓయూ
హిటాచీతో ఎంవోయూ
జ్యూరిచ్ తో సిస్టర్ సిటీ ఒప్పందం
ట్రాన్స్ ఫార్మింగ్ అగ్రికల్చర్, న్యూ అగ్రికల్చర్, టెక్నాలజీస్ ఆఫ్ టుమారో అంశాలపై జరిగే సెషన్స్ లో ప్రసంగం