ఈజిప్టులో ఓ గన్మెన్ బస్సుపై కాల్పులతో విరుచుకుపడ్డాడు. ఈ కాల్పుల్లో దాదాపు 23 మంది మృతి చెందగా.. 25 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్ అన్బా శామ్యూల్ మొనాస్టరీకి బస్సులో వెళ్తున్న క్రైస్తవులపై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. దేశంలోని కోప్టిక్ క్రైస్తవులపై గత కొంతకాలంగా ఐఎస్ఐ తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఏప్రిల్లో రెండు చర్చిలపై జరిగిన బాంబు దాడుల్లో 46 మంది చనిపోయారు.