రాధ భారతీయ సినీనటి.ఈమె అసలు పేరు ఉదయ చంద్రిక.ఈమె జూన్ 3, 1966 లో జన్మించింది.తెలుగు మరియు తమిళ చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించింది. ఈమె అక్క అంబిక కూడా సినిమా నటే.
రాధ భర్త పేరు రాజశేఖరన్ నాయర్.వీరికి ముగ్గురు పిల్ల్లలు వారు కార్తికా నాయర్, విఘ్నేష్, తులసి నాయర్.రాధ, భారతీరాజా సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లైతో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించింది.
ఈమె రజినీకాంత్తో రాజాధిరాజా చిత్రములో, కమలహాసన్తో ఒరు ఖైదీయిన్ డైరీలో నటించింది. శివాజీ గణేషన్ సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది.
ఈమె తన నటనా జీవితపు తారాస్థాయిలో తన బంధువైన మణి అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది. పెళ్ళి తర్వాత రాధ సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో ప్రస్తుతము ఈమె ఒక రెస్టారెంటును నిర్వహిస్తున్నది.
ముగ్గురు పిల్లలకు తల్లైన రాధ తన పెద్ద కూతురు కీర్తిగతో పాటు 8 సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి 2006 మార్చిలో చిదంబరము నటరాజ ఆలయములో ప్రతి సంవత్సరము జరిగే నాట్యాంజలి ఉత్సవములో నాట్య ప్రదర్శన చేసినది.
ఆమె తెలుగు లో అగ్ర తారలందరితోను నటించింది.ఆమె నటించిన పలు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కార్తీక తెలుగు చిత్ర సీమకు తొలిసారిగా అక్కినేని వారసుడు నాగచైతన్య జోష్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. తరువాత తెలుగులో వరుసగా దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినామాల్లో సెంకడ్ రోల్ పోషించింది.
ఇక ఇక్కడ తగినంత ఆఫర్లు రాకపోవడంతో తమిళ చిత్ర సీమ వైపు వెళ్లిన అక్కడా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఇక లాభంలేదనుకున్న కార్తీక హిందీ టీవీ సీరియల్స్తో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఫిలిం వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. తల్లి రాధ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి తన వారసురాలిగా అడుకుపెట్టిన కార్తీక మాత్రం ఇలా చిత్రసీమకు దూరం కావడం విశేషం.