జాతిపిత మహాత్మాగాంధీ చిత్రంతో ఉన్న అరుదైన స్టాంపులు యూకేలో రికార్డు ధర పలికాయి.
యూకేలోని స్టాన్లీ గిబ్బన్స్ అనే స్టాంప్ కలెక్టింగ్ కంపెనీ మహాత్ముడి చిత్రంతో ఉన్న నాలుగు స్టాంపులను వేలం వేయగా.. రికార్డు స్థాయిలో 5లక్షల పౌండ్లు పలికాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 4.14కోట్లు. వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నారు. యూకేలో ఓ భారత స్టాంప్కు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. 1948 నాటి పది రూపాయల విలువ గల మహాత్ముడి స్టాంపులు కేవలం 13 మాత్రమే చలామణిలో ఉన్నట్లు వేలం నిర్వాహకులు చెప్పారు. ఇందులో నాలుగింటిని ఇప్పుడు వేలం వేయగా.. మరో నాలుగు రాయల్ ఫిలాటెలిక్ కలెక్షన్ హౌస్లో ఉన్నట్లు తెలిపారు. ఈ కలెక్షన్ హౌస్ బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు చెందినది.