జంతువులు,పక్షులు గుడ్లుపెట్టడం మనకు తెలిసిందే.కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒక మనిషి గుడ్లు పెడుతున్నాడు.ఆనాడు బ్రహ్మం గారు చెప్పినట్టు లోకంలో రకరకాల వింతలు,విడ్డురాలు చోటు చేసుకుంటాయి అన్నారు.ఇప్పుడు ఈ సరికొత్త విచిత్రం ఇండోనేషియాలో చోటు చేసుకుంది.
ఇండోనేషియాకు చెందిన అక్మల్ గత రెండేళ్ల నుంచి గుడ్లు పెడుతున్నాడనీ,ఇప్పటి వరకు 20 గుడ్లు పెట్టాడనీ అతని తండ్రి తెలిపాడు.ఈ విచిత్ర వ్యవహారంపై వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోయింది.డాక్టర్ల ఎదుటే అక్మల్ రెండు గుడ్లు పెట్టాడు.దీంతో గుడ్లు తేలేయడం వైద్యుల వంతైంది.అక్మల్కు అన్ని పరీక్షలు నిర్వహించినా,అసలు విషయాన్ని మాత్రం కనిపెట్టలేక చేతులెత్తేశారు.
అంతేకాకుండా మనిషి గుడ్లు పెట్టడం అసాధ్యమని,అక్మల్ గుడ్లు మింగేసి ఉంటాడని అవే బయటకు వస్తుండవచ్చని చెబుతున్నారు.అయితే అక్మర్ తండ్రి మాత్రం తన కొడుకు ఇంతవరకు గుడ్డు మింగలేదని తెలిపారు.పైగా అతడు పెట్టే గుడ్డు పూర్తిగా ఎల్లో లేదా వైట్గా ఉంటుందని పేర్కొన్నారు.ఈ గుడ్డుపై ప్రయోగాలు చేపట్టారు.